ఢిల్లీకి చెందిన ఇండిగో విమానానికి పెను ముప్పు తప్పింది. విమానం టేకాఫ్కు ముందే ఇంజిన్లో మంటలు చెలరేగాయి. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న విమానం… ఢిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా ఇంజిన్లో మంటలు చెలరేగాయి. పైలట్ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అత్యవసర ల్యాండింగ్ చేశాడు. ఆ తర్వాత ప్రయాణికులంతా దిగిపోయారు. కిటికీలోంచి మంటలు ఎగిసిపడుతుండటం చూసి ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను మరో విమానంలో పంపించారు.
#బ్రేకింగ్ #నీలిమందు ఫ్లైట్ 6E-2131 (ఢిల్లీ నుండి బెంగళూరు) అనుమానాస్పద స్పార్క్స్ కారణంగా ఢిల్లీ విమానాశ్రయం వద్ద చూసింది @అతుల్_భాటియా80 pic.twitter.com/IwwRfdACQq
— shashwat bhandari (@ShashBhandari) అక్టోబర్ 28, 2022
The post ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్లో మంటలు తప్పిన ప్రమాదం appeared first on T News Telugu.