ఎమ్మెల్సీ కవితకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు ఆహ్వానం. వచ్చే నెలలో కేరళలోని కన్నూర్లో లైబ్రరీ కాంగ్రెస్ ఆఫ్ ఇండియా సదస్సు జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా కవితకు ఆహ్వానం అందింది. దీంతో వచ్చే నెల 2, 3 తేదీల్లో ఆమె కేరళలో పర్యటించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా, జనవరి 2 సాయంత్రం జరిగే కల్చరల్ ఫెస్టివల్కు కవిత ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 3న సాంస్కృతిక చర్చల్లో పాల్గొంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్నాటక, బీహార్ తదితర వివిధ రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
The post ఎమ్మెల్సీ కవితకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ఆహ్వానం appeared first on T News Telugu.