![ఇండోనేషియా భూకంపం: మృతుల సంఖ్య 310కి చేరింది](https://d2e1hu1ktur9ur.cloudfront.net/wp-content/uploads/2022/11/Indonesia-earthquake.jpg)
జకార్తా: ఇండోనేషియాలో గత సోమవారం సంభవించిన భూకంపం మృతుల సంఖ్య పెరిగింది. ఇండోనేషియా నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ శుక్రవారం నాటికి మృతుల సంఖ్య 310కి చేరుకుందని ప్రకటించింది. గత సోమవారం మధ్యాహ్నం 1:21 గంటలకు పశ్చిమ జావాలోని సియాంజూర్ జిల్లాలో 5.6 తీవ్రతతో భూకంపం వచ్చింది.
ఈ ఘటనలో 200 మందికి పైగా చనిపోయారు. 2,000 మందికి పైగా గాయపడ్డారు. మొత్తం 56,320 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 31 పాఠశాలలు, 124 ప్రార్థనా స్థలాలు, 3 ఆసుపత్రులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాదాపు 62,000 మంది ఇళ్లు కూలిపోవడంతో నిరాశ్రయులయ్యారు. ఈ ప్రాంతంలో నిరాశ్రయుల కోసం పద్నాలుగు శరణార్థి శిబిరాలను ఏర్పాటు చేశారు.
భూకంపం సంభవించిన ప్రాంతంలో గత ఐదు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిలో పలువురు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. భవనం శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల సంఖ్య 310కి చేరింది. ఇంకా 24 మంది గల్లంతయ్యారు.
855256