ఆంధ్రప్రదేశ్లోని శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ దంపతులు రమ్య, గోపీనాథ్, వారి పిల్లలు సాహిత్, హాసిని, బంధువు బెంగళూరు నుంచి హైదరాబాద్కు కారులో వెళ్తున్నారు. పర్వతదేవరపల్లి వద్దకు రాగానే కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమ్య, గోపీనాథ్లు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి కోడలు తారకేశ్వరి, పిల్లలు సాహిత్, హాసినికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తారకేశ్వరి (62 ఏళ్లు) మృతి చెందింది. చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.