హైదరాబాద్, స్పోర్ట్స్ రిపోర్టర్: తెలంగాణ యువ క్రీడాకారిణి జీవంజీ దీప్తి అంతర్జాతీయ వేదికపై మరోసారి తన సత్తా చాటుకుంది. బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా)లో జరిగిన ప్రతిష్టాత్మక ఓషియానా ఆసియా క్రీడల్లో ప్రతిభకు అవధులు లేవని నిరూపించిన దీప్తి. మహిళల టీ20 ఈవెంట్ 400 మీటర్ల ఫైనల్లోకి ప్రవేశించింది. ఫైనల్ బుధవారం ఉదయం 11:30 గంటలకు జరుగుతుంది. దీప్తి కల్లెడ (వరంగల్)లోని పేద కుటుంబం నుండి వచ్చింది. కష్టపడి పని చేస్తే తప్ప పూటగడవని పరిస్థితి. నేషనల్ ట్రాక్ కోచ్ నాగపురి రమేష్ దీప్తి ప్రతిభను గుర్తించి ఆమెను అందంలా తీర్చిదిద్దారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలనే పట్టుదలతో దీప్తి బరిలోకి దిగనుంది.
831814