పెళ్లి పీటలు ఎక్కబోతోంది.. అందరూ బీబీబీజీలే. అప్పుడే ఓ మహిళ తన పెళ్లి నగలతో ఉడాయించింది. ఈ ఘటన జార్ఖండ్లోని రాంచీలో చోటుచేసుకుంది. నగరంలో ఓ కుటుంబం తమ కూతురి పెళ్లి వేడుకను జరుపుకుంటోంది. అందరూ వివాహ వేదికలోని ఫంక్షన్ గదికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులు బంధు మిత్రులను స్వీకరిస్తున్నారు. అందరినీ పేరుపేరునా పలకరించారు. బాంక్వెట్ హాలు మొత్తం సీట్లతో నిండిపోయింది. సాయంత్రం అవుతుండగా, ఒక్కొక్కరు తమ తమ గదులకు వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యారు. ఈ క్రమంలో రూ.2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, డబ్బులు కనిపించక పోవడంతో షాక్ కు గురయ్యారు.
సీసీటీవీలో చూడగా ఓ మహిళ నగలు, డబ్బుతో ఫంక్షన్ రూమ్ నుంచి బయటకు రావడం కనిపించింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళకు ఆభరణాలు చోరీకి మరో వ్యక్తి సహకరించాడని గుర్తించిన తర్వాత వారిద్దరిపై గాలింపు చర్యలు చేపట్టామని రాంచీ రూరల్ ఎస్పీ నౌషాద్ ఆలం తెలిపారు.