ఈ నెల 21 లేదా 22 తేదీల్లో హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో బహుమతులపై క్రైస్తవ సంఘం ప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్షించారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క్రిస్మస్ వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అలాగే.. ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో క్రిస్టియన్ భవనాల కోసం రెండెకరాల స్థలం సిద్ధంగా ఉందని.. క్రిస్టియన్ భవనాల నిర్మాణానికి క్రిస్మస్ లోపు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. క్రైస్తవ భవనాల కోసం స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
క్రిస్మస్ను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లోని క్రైస్తవ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ క్రిస్మస్ కేక్ కట్ చేశారు.