ముందస్తు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నాలుగు గంటల్లో 25.08 శాతం ఓట్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ స్టేషన్ సిబ్బంది సర్వం సిద్ధం చేశారు.
ఉదయం 9 గంటల సమయానికి 11.2 పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇదే జోరు కొనసాగితే సాయంత్రం 6 గంటల వరకు జోరుగా ఓటింగ్ జరిగే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.