కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి, ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి బ్లాక్ బస్టర్ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. గత కొంత కాలంగా బీజేపీకి దూరంగా ఉన్న జనార్దన్ రెడ్డి ఆ పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆదివారం తన నివాసం “పారిజాత”లో మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీని వీడుతున్నట్లు జానారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. తన కొత్త రాజకీయ పార్టీ పేరు “కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష” అని కూడా ఆయన ప్రకటించారు.
The post బీజేపీకి గాలి జనార్థన్ రెడ్డి రాజీనామా appeared first on T News Telugu.