హైదరాబాద్: ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దంపతులు ఘనంగా గోదాదేవి కళ్యాణం నిర్వహించారు. నిర్మల హృదయంతో నిత్య పుష్పాలతో శ్రీ రంగనాథుని సేవించి ఆ స్వామికి తన జీవితాన్ని అంకితం చేసిన మహా భక్తురాలు గోదాదేవి కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, శోభమ్మల నేతృత్వంలో వేదపండితుల వేద మంత్రోచ్ఛరణలతో వైభవంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవం ఆనందోత్సాహాలతో కొనసాగింది.
హిందూ సంప్రదాయం ప్రకారం…
ప్రతి సంవత్సరం ధనుర్మాసం సందర్భంగా 30 రోజుల పాటు సాగే శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరుప్పావై పాసురాలు పారాయణం అనంతరం గోదాదేవి కల్యాణంతో ధనుర్మాస వ్రతం ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సోదరీమణులు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.