![గోదాలీ ఒడ్డున హారతి వైభవం](https://d2e1hu1ktur9ur.cloudfront.net/wp-content/uploads/2022/10/6dmp28a.jpg)
దామోపురి, అక్టోబర్ 28: కార్తీక మాసం సందర్భంగా ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం ఆలయం నుంచి వేదపండితులు, అర్చకులు మంగళ వాయిద్యాలు, మహిళల కోరాటాల వాద్యాలతో ఆలయం నుంచి గోదావరి నది వరకు ఊరేగించారు. అనంతరం వేదపండితులు బొజ్జా రమేశ్ శర్మ మంత్రోచ్ఛరణలతో గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం భక్తులు కటిక దీపాన్ని నదిలో వదిలారు. కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ ద్యావల్ల కిరణ్కుమార్, పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఇందారపు రామన్న, ఇనుగంటి రామవెంకటేశ్వరరావు, గందె పద్మశ్రీనివాస్, చుక్కా రవి, వేదపండితులు రమేష్ శర్మ, ముత్యాల శర్మ, పాలెపు ప్రవీణ్కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.
816845