హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు. ఇక నుంచి రాంగ్ వే, త్రీ రైడ్లు, ఉల్లంఘనలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక రెక్టిఫికేషన్ను ప్రారంభించారు.
తప్పుడు మార్గంలో వెళితే రూ.1700, ముగ్గురు రైడింగ్ చేస్తే రూ.1200 జరిమానా విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఉదయం నుంచి గోషామహల్, అబిడ్స్, నాంపల్లి, సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని కూడళ్లలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.