తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తమిళనాడు వీసీకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేల బృందం కొనియాడింది. హైదరాబాద్ బోరబండ ఎస్పీఆర్ హిల్స్లోని దళిత అధ్యయన కేంద్రాన్ని వీసీకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేల బృందం సందర్శించింది. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణలో దళితుల కోసం అమలు చేస్తున్న దళిత బంధు, ఇతర సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేయడంపై చర్చ జరిగింది. కరీంనగర్, హుజూరాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటించి దళితులకు మూడెకరాల భూమి, ఇతర పథకాలు అందించారని కొనియాడారు. దాదాపు రెండు రోజులపాటు దళితులకు ఈ కార్యక్రమం జరిగింది. దళితుల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ పర్యటనలో వీసీకే పార్టీ నేత సెల్వన్, ఎమ్మెల్యేలు త్రిపూర్, ఎస్ఎస్ బాలాజీ, చెన్నై కార్నర్ స్టోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రిచర్డ్ దేవదాస్, త్రివేండ్రం ఎస్ఎఎస్వై కోఆర్డినేటర్ మురుగప్పన్, తమిళనాడు సోషల్ వాచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీఏ.రమేష్ నాథన్ తో
ఈ కార్యక్రమంలో తెలంగాణ దళిత పరిశోధనా కేంద్రం చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, అసోసియేటెడ్ ప్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, సీనియర్ ఎడిటర్ రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Trending
- KCR’s speech gets roaring response from people-Telangana Today
- ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!
- రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana
- More of the same-Telangana Today
- మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!
- ‘లోక్సభ’కు బీఆర్ఎస్ సన్నద్ధం-Namasthe Telangana
- Property tax cheques bounce, GHMC takes action-Telangana Today
- గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!