హైదరాబాద్: కొత్త సచివాలయం నిర్మాణం తెలంగాణ అమరవీరుల త్యాగఫలమని సీఎం కేసీఆర్ అన్నారు. తుది దశకు చేరుకున్న సచివాలయ నిర్మాణ పనులను గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ పరిశీలించారు. సచివాలయం ప్రధాన ద్వారం నుంచి చివరి అంతస్తు వరకు అన్ని పనులను పరిశీలించి తగిన సూచనలు చేశారు.
తెలంగాణ ప్రజల అభీష్టం మేరకే సచివాలయాన్ని నిర్మిస్తున్నామని సీఎం చెప్పారు. అంబేద్కర్ పేరు నిలబెట్టి ప్రజలకు సుపరిపాలన అందించడమే సచివాలయం ఏర్పాటు ఉద్దేశమన్నారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రగతిపథంలో పయనిస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఈ సచివాలయం బలోపేతం చేస్తుందన్నారు. గత వందేళ్లలో ధోల్పూర్ రాయిని ఇంత పెద్దగా వినియోగించలేదని గుర్తు చేశారు. మరే దేశంలోనూ ఈ స్థాయిలో సచివాలయాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. సచివాలయం ఎదుట అమరవీరుల గోపురం నిర్మాణం చేపడతామన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. సెక్రటేరియట్ పక్కనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంబేద్కర్ విగ్రహం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడాన్ని గుర్తుచేస్తుందని కేసీఆర్ అన్నారు.
సీఎం కేసీఆర్ వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంజినీర్లు, అధికారులు ఉన్నారు.
కొత్త సచివాలయం నిర్మాణ పురోగతిని కౌలూన్ మరియు కాంటన్ ముఖ్యమంత్రి పరిశీలించారు. మంత్రి మరియు సీఎం @త్రిషరీష్, @VPRTRS, @VSrinivasగౌడ్, @జగదీష్ టిఆర్ఎస్, @IKReddyAllolaచాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ అధికారులు ఉన్నారు pic.twitter.com/OcQnGRxrB0
– నమస్తే తెలంగాణ (@ntdailyonline) నవంబర్ 17, 2022
843427