భారత అంతరిక్షయాన రంగంలో మరో చారిత్రక మైలురాయి ఆవిష్కృతమైంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ ఏరోస్పేస్ కార్పొరేషన్ ప్రైవేట్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు విక్రమ్-ఎస్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్కు చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఈ రాకెట్ను రూపొందించింది. బృందానికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. హైదరాబాద్కు చెందిన ఈ సంస్థ కొత్త చరిత్రను లిఖించడం గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.
కొత్త భూభాగంలోకి అడుగుపెట్టినందుకు స్కైరూట్ బృందానికి అభినందనలు 👏
ఒక భారతీయ కంపెనీ మరియు హైదరాబాద్ ఆధారిత కంపెనీ రెండూ చరిత్రను వ్రాసినందుకు చాలా గర్వంగా ఉంది https://t.co/xlUtybHuOn
— కేటీఆర్ (@KTRTRS) నవంబర్ 18, 2022