![బాలల దినోత్సవం సందర్భంగా విషాదం.. స్కూల్ బస్సు బోల్తా, ఇద్దరు మృతి](https://d2e1hu1ktur9ur.cloudfront.net/wp-content/uploads/2022/11/school-bus-accident.jpg)
డెహ్రాడూన్: బాలల దినోత్సవం రోజు విషాదం. విహారయాత్రకు పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి, ఉపాధ్యాయుడు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని సితార్గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. బాలల దినోత్సవం సందర్భంగా కిచ్చా జిల్లా నయాగావ్ భట్టేలోని వేదారం పాఠశాలకు చెందిన విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లారు. 51 మంది పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు బోల్తా పడింది.
ఇంతలో చిన్నారుల రోదనల మధ్య ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సాయం కోసం ముందుకొచ్చారు. అధికారులకు సమాచారం అందించిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఓ బాలిక, ఉపాధ్యాయురాలు మృతి చెందారు. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల మృతి పట్ల ఆయన సంతాపం తెలిపారు. గాయపడిన విద్యార్థికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
839160