
న్యూఢిల్లీ: దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. ఈ రాజశ్యామల యాగం కోసం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక యాగశాలను నిర్మించారు. ఈ రాజశ్యామల యాగంలో పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి అధినేత కేసీఆర్ పాల్గొన్నారు.
మంగళవారం ఉదయం 11 గంటలకు యాగం ప్రారంభమవుతుంది. 12 మంది ఋత్విక్కులు గణపతి పూజతో రాజశ్యామల యాగాన్ని ప్రారంభించారు. యాగం కోసం 12 మంది ఋత్విక్కులు సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం పుణ్యహవచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపం నిర్వహించారు. ఈరోజు నవ చండీ హోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నారు. శృంగేరి పీఠం గోపీకృష్ణశర్మ, ఫణి శశాంకశర్మ ఆధ్వర్యంలో యాగాలు జరుగుతున్నాయి.