మహిళలకు సంబంధించి బీసీసీఐ, క్రికెట్ బోర్డు ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రిఫరీగా మహిళలకు అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. రాబోయే రంజీ ట్రోఫీలో మహిళలు రిఫరీలుగా వ్యవహరిస్తారు.
భారతదేశంలో ప్రస్తుతం మహిళా రిఫరీలు గాయత్రి, జనని మరియు బృందారథి సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో మహిళా రిఫరీల సంఖ్యను పెంచాలని బీసీసీఐ నిర్ణయించింది. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్లో కూడా మహిళా రిఫరీలు కనిపిస్తారని బీసీసీఐ అధికారులు తెలిపారు.