బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తుపాను తీరం వైపు కదులుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా చెన్నై విమానాశ్రయానికి వెళ్లే అనేక విమానాలను నిలిపివేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈరోజు (శుక్రవారం) చెన్నై ఎయిర్పోర్ట్కు వెళ్లే విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
తుఫాను చెన్నై నగరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో పార్కులు, ఆటస్థలాలతో పాటు చెన్నైలోని పాఠశాలలు, కళాశాలలను డిసెంబర్ 10న మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది.