సూర్యాపేట: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బండమీది చందుపట్ల గ్రామానికి చెందిన 200 మంది తమ తమ రాజకీయ పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు.
ఈసారి గులాబీ కండువాలు కప్పి గల్లాలోకి ఆహ్వానించి అనంతరం మాట్లాడారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేశారన్నారు. తెలంగాణలో రైతులకు జరుగుతున్న మేలును దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అందించేందుకు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ను ప్రారంభించామన్నారు.
కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎంపీపీ కుమారిబాబు, జెడ్పీటీసీ సంజీవ, నాయకులు పాల్గొన్నారు.
The post ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరిక appeared first on T News Telugu.