మెదక్: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురం శివారులో దారుణం జరిగింది. కారులో ఉన్న ఓ వ్యక్తి సజీవ దహనం కాగా, పరిస్థితి అనుమానాస్పదంగా ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కారు దగ్గర బ్యాగ్, పొదల్లో పెట్రోల్ క్యాన్ లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మృతుడు సచివాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పాతులోతు ధర్మగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే అర్థరాత్రి కారులో ఉన్న గుర్తుతెలియని వ్యక్తులు అతడిని సజీవ దహనం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.