హైదరాబాద్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదాయం రికార్డు స్థాయికి చేరుకుంది. వివిధ సేవల ద్వారా రూ.1,16,13,977 ఆర్జించారు. ఇంత డబ్బు రావడం ఇదే మొదటిసారని ఆలయ అధికారులు తెలిపారు.
కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో హైదరాబాద్ జంటనగరాలతో పాటు పలు ప్రాంతాల నుంచి లక్ష్మీనరసిం హస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ధర్మదర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతుందని ఆలయ వర్గాలు తెలిపాయి.
గత ఆదివారం కూడా యాదగిరిగుట్టలోకి భారీగా భక్తులు తరలి వచ్చిన విషయం తెలిసిందే. ఒక్క రోజు ఆదాయం రికార్డు స్థాయిలో రూ.10,982,000కి చేరినట్లు అర్థమవుతోంది.