మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిందన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొని… ప్రసంగించారు. దేశంలోనే రైతులకు పెట్టుబడి సాయం, ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
గుజరాత్ లో ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు వెళ్లే పరిస్థితి లేదని…ఉచిత కరెంటు లేదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అన్ని రంగాల్లో విఫలమైన ప్రధాని మోదీ తెలంగాణపై మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ వద్ద చాలా నల్లధనం ఉందన్నారు.
భారతదేశం మొత్తం అంధకారంలో ఉందని, అయితే తెలంగాణ మాత్రం వెలిగిపోతోందని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ నుంచి పొరుగు దేశానికి కావాల్సిన పరిష్కారం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, మోడీ వల్లే దేశానికి పెను ప్రమాదమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మోదీకి వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.