కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్టగుప్ప సమీపంలో లారీని కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి.
మృతులంతా దినసరి కూలీలేనని సాక్షులు, పోలీసులు తెలిపారు. పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా బేమలఖేడాలోని ప్రభుత్వ పాఠశాల వద్దకు రాగానే కారును ట్రక్కు ఢీకొట్టింది.
మృతులను పార్వతి (40), పద్మావతి (36), గుండమ్మ (60), యాదమ్మ (40), జగ్గమ్మ (34), ఈశ్వరమ్మ (55), రుక్మిణి (60)గా గుర్తించినట్లు విడాల్ పోలీసులు వెల్లడించారు.