నిర్మల్ జిల్లా: విద్యార్థుల ఎదుగుదలకు ఆకాశమే హద్దు అని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకువస్తోందని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కేటీఆర్ కోరారు.
బాసర ఆర్జీయూకేటీలో జరిగిన 5వ స్నాతకోత్సవంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. బాసర స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు మంత్రులు ప్రత్యేక హెలికాప్టర్లో బాసర ఆర్జీయూకేటీకి చేరుకున్నారు. బాసర ఆర్జీయూకేటీ వీసీ వెంకటరమణ మంత్రులకు స్వాగతం పలికారు.
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడే ముందు బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, యూనిఫాంలను మంత్రి కేటీఆర్ అందజేశారు. రూ.50 కోట్లతో సైన్స్ లేబొరేటరీని నిర్మిస్తారు. ఆర్జీయూకేటీ చెరువుల సుందరీకరణకు తనవంతు సహకారం అందిస్తానన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, వేణు గోపాలాచారి, కలెక్టర్ ముషారఫ్, వీసీ వెంకట రమణ, డైరెక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.