తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు (శుక్రవారం) అమ్మవారు సర్వభూపాల వాహనంలో శ్రీకృష్ణుడి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, భక్తుల మంత్రోచ్ఛారణలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను అలరించారు. అమ్మవారిని పూజించేందుకు భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు అందజేస్తున్నారు.
అనంతరం శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మవారికి ఆలయ అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు.