![brs brs](https://i0.wp.com/tnewstelugu.com/files/2023/01/brs.jpg?resize=696%2C364)
ఆంధ్ర సమాజం భారత రాష్ట్ర సమితి (BRS)లో చేరడానికి హైదరాబాద్కు వెళ్లింది. సోమవారం సీఎం కేసీఆర్ సమక్షంలో రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు, రిటైర్డ్ ఐఆర్ ఎస్ పార్థసారథి, టీజే ప్రకాష్ తోపాటు పలువురు ప్రముఖులు బీఆర్ ఎస్ లో చేరారు. ఈ చేరికల నేపథ్యంలో గుంటూరు, విజయవాడ తదితర ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది మంది అభిమానులు హైదరాబాద్ కు తరలివెళ్లారు.
ఏపీ నేతలు చేరడంతో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ పరిసరాలు సందడిగా మారాయి. నినాదాలు మిన్నంటాయి. కార్యకర్తలు జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ భవన్కు కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. ఇలా తెలంగాణ భవన్ పరిసరాలన్నీ గులాబీల అందాలను సంతరించుకుంటున్నాయి.