హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ-2023 అవార్డుల్లో రాజన్నసిరిసిల్ల జిల్లా 4 స్టార్ల విభాగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు దృఢ సంకల్పంతో అద్భుతాలు సృష్టించారని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అభినందించారు.
ఈ విజయానికి కారణమైన సిరిసిల్ల జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, జిల్లా అధికారులు, సర్పంచ్లు, నియోజకవర్గ సభ్యులు, పంచాయితీ సెక్రటరీ, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్.
ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో సిరిసిల్ల రాట మార్చే యజ్ఞంలో కృషి చేసిన వారందరికీ ఈ అవార్డును అంకితం ఇస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాలను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు జిల్లా అధికారులు మరింత కృషి చేయాలని కోరారు.
అభినందనలు #రాజన్నసిరిక్తో ప్రాంతం #తెలంగాణ నవంబర్ 2022లో 4-నక్షత్రాల విభాగంలో 1వ స్థానం #SwachhSurvekshanGrameen2023
బాగా చేసారు 👍🏽#స్వచ్ఛ్భారత్ మిషన్ #SBMG #ODFPlus@gssjodhpur @ప్రహ్లాద్స్పటేల్@మహాజన్_విని@MoRD_GoI @iamvikassheel pic.twitter.com/jvwKjGcXvl
— తాగునీరు మరియు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ (#DDWS) (@MoJSDDWS) డిసెంబర్ 2, 2022
స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ)లో భాగంగా, నవంబర్లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2023 అందించిన పారామితుల ఆధారంగా 4-స్టార్ ర్యాంకింగ్ విభాగంలో సిరిసిల్ల జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఓడీఎఫ్ ప్లస్ కేటగిరీలో అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించిన రాజన్న సిరిసిల్ల దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.