
ఈ నెల 30న (మార్చి) శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్లో మద్యం దుకాణాలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నగరంలో మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్లు, క్లబ్బులు, పబ్బులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
మార్చి 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మార్చి 31వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
