
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ లాక్హీడ్ తన తదుపరి సప్లయ్ చైన్ మీటింగ్ను హైదరాబాద్లో నిర్వహించాలని యోచిస్తోందని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్ ఒక ప్రసిద్ధ అమెరికన్ ఏరోస్పేస్, ఆయుధాలు, రక్షణ, సమాచార భద్రత మరియు సాంకేతిక సంస్థ.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. అంతర్జాతీయ కార్యకలాపాలు, గ్లోబల్ బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రే పిసెల్లి, అంతర్జాతీయ ప్రభుత్వ వ్యవహారాల డైరెక్టర్ డేవ్ సుటన్ సహా లాక్హీడ్ మార్టిన్ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. వాషింగ్టన్, D.C. లో జరిగిన సమావేశంలో, COVID-19 మహమ్మారి సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అసమానమైన మద్దతు ఇచ్చినందుకు లాక్హీడ్ మార్టిన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
