నిరుద్యోగులకు శుభవార్త. మీరు కూడా దేశ సేవ చేయాలనుకుంటే మీకో గొప్ప అవకాశం సిద్ధంగా ఉంది. భారత వైమానిక దళంలో చేరేందుకు దరఖాస్తు ప్రక్రియ షురూ కానుంది. జనవరి 17 నుండి ఫిబ్రవరి 6, 2024 వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పురుష, మహిళా అగ్నిమాపక సిబ్బంది రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. వైమానిక దళంలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ కోసం అర్హులైన (అవివాహిత) స్త్రీ, పురుష అభ్యర్థులు వెబ్ పోర్టల్లో ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని అంబాలాలోని ఎయిర్మ్యాన్ సెలక్షన్ సెంటర్ కమాండింగ్ ఆఫీసర్ వింగ్ కమాండర్ ఎస్వీజీ రెడ్డి తెలిపారు.
ఈ రిజిస్ట్రేషన్ జనవరి 17, 2024 ఉదయం 11 గంటల నుండి ఫిబ్రవరి 6, 2024 రాత్రి 11 గంటల వరకు చేయవచ్చు. జనవరి 2, 2004 నుండి జూలై 2, 2007 వరకు జన్మించిన పురుష, స్త్రీ అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్కు అర్హులు. నిర్ణీత వ్యవధిలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న యువతకు ఆన్లైన్ పరీక్ష మార్చి 17 నుంచి ప్రారంభం కానుంది.
విద్యార్హతలు:
గణితం, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో కలిపి మొత్తంగా 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులు, ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఇందుకు అర్హులని వింగ్ కమాండర్ ఎస్వీజీ రెడ్డి తెలిపారు.
50 శాతం మార్కులతో ఒకేషనల్ కోర్సు చేస్తున్న యువత కూడా అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్కు అర్హులు. సైన్స్ సబ్జెక్టులతో పాటు ఇతర సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం, ఇంగ్లిష్లో 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్, పరీక్ష రుసుము రూ.550తో పాటు జీఎస్టీ ఉంటుందని ఆయన తెలియజేశారు . రిక్రూట్మెంట్కు సంబంధించిన మొత్తం సమాచారం వెబ్సైట్లో అందుబాటులో ఉందని వింగ్ కమాండర్ ఎస్వీజీ రెడ్డి తెలిపారు. ఈ రిక్రూట్మెంట్ కోసం అర్హులైన, ఆసక్తిగల యువత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: గోవా బీచ్ లో మల్లారెడ్డి మజా
