
మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే తన పార్టీపై ఓ నేత తిరుగుబాటు చేయడంతో ఉలిక్కిపడిన మహారాష్ట్ర రాజకీయాలు మరో భారీ కుదుపును చవిచూడబోతున్నాయి. ఎన్సీపీ ఎమ్మెల్యే ట్వీట్ ఇందుకు ఉదాహరణ. ఎన్సీపీ ఎమ్మెల్యే అమోల్ మిత్కారీ ట్వీట్ చేశారు. త్వరలో అజిత్ పవార్ ముఖ్యమంత్రి అవుతారని సమాచారం.
ఈ సందర్భంగా మద్దతుదారులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. కొన్ని బిల్బోర్డ్లలో అజిత్ పవార్ను మహారాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రిగా చిత్రీకరించారు. త్వరలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేను అజిత్ అనంతరావు పవార్ అని ఎమ్మెల్యే ట్వీట్ చేశారు.
