
మేడ్చల్ జిల్లాలో పేకాటరాయుళ్లపై పోలీసులు దాడులు చేశారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాజీగూడ శివనగర్లోని పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న తొమ్మిది మంది పేకాటరాయుళ్లను పట్టుకుని ఘటనా స్థలంలో అదుపులోకి తీసుకున్నారు.
గతంలో వచ్చిన కథనాల ప్రకారం పేకాట హౌస్పై దాడి చేసి తొమ్మిది మందిని అరెస్ట్ చేసి అల్వాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 45 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అల్వాల్ ఎస్ ఎస్ భాస్కర్ తెలిపారు.
