
ప్రపంచంలోనే మోదీని మించిన అవినీతిపరుడు లేడని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వ్యాపారవేత్త అదానీకి లబ్ధి చేకూర్చేందుకే ప్రధాని అవినీతికి పాల్పడ్డారన్నారు. నిజామాబాద్ జిల్లా మోతాడ్లో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. అవినీతిని ప్రధాని ప్రశ్నించినందుకే తెలంగాణకు వ్యతిరేకంగా పార్టీ పెట్టారన్నారు. కావాలనే ఎమ్మెల్సీ కవిత వేధింపులకు పాల్పడ్డారని విమర్శించారు. మోదీ ప్రధాని అయ్యాక అదానీ ఆస్తులు రూ.50 వేల కోట్లు ఉంటే, ఎనిమిదేళ్లలో రూ.12 వేల కోట్లకు ఎలా వచ్చాయి? బ్యాంకు రుణాలు వదులుకోవడం వల్ల ఎస్బీఐ రూ.70 కోట్లు నష్టపోయిందన్నారు.
