ఓ విద్యార్థికి ఇద్దరు తోటి విద్యార్థులు జ్యూస్లో మూత్రాన్ని కలిపి తాగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తిరుచిరాపల్లిలోని తమిళనాడు నేషనల్ లా యూనివర్శిటీలో జరిగింది. లా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు తమ క్లాస్మేట్కు మూత్రంలో జ్యూస్ కలిపి తాగించారు. ఈ కారణంగా యూనివర్సిటీ యాజమన్యం ఆ ఇద్దరు విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది.
Read Also: బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు భారతరత్న
బాధిత విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 6న తన తోటి విద్యార్థులు ఇచ్చిన జ్యూస్ను తాగినట్లు చెప్పాడు. కాగా.. ఆ మరుసటి రోజు నుంచి క్లాస్రూమ్లో అతన్ని సహవిద్యార్థులు హేళన చేయడం ప్రారంభించారన్నారు. చివరకు తనను ఎందుకు ఇలా చేస్తున్నారని తెలుసుకున్న బాధిత విద్యార్థి.. జ్యూస్లో మూత్రం కలిపి ఇచ్చారని తెలుసుకున్నాడు. దీంతో ఆ విద్యార్థి వైస్ ఛాన్సలర్ నాగరాజ్కు ఫిర్యాదు చేశాడు. కాగా.. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న యూనివర్సిటీ యజమాన్యం.. ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జనవరి 18న తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో ఈ ఘటనకు పాల్పడ్డ విద్యార్థులను ప్రస్తుత సంవత్సరంలో 10వ-సెమిస్టర్ పరీక్షలకు హాజరుకాకుండా ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేసింది. అంతేకాకుండా.. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని రామ్జీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
