యెమెన్ ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ సోమవారం ప్రధానమంత్రి మైన్ అబ్దుల్మాలిక్ సయీద్ను తొలగించింది. దేశ కొత్త ప్రధానమంత్రిగా విదేశాంగ మంత్రి అహ్మద్ అవద్ బిన్ ముబారక్ను కౌన్సిల్ నియమించింది. ప్రస్తుతం, యెమెన్లోని ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా నేతృత్వంలోని మిలటరీ సంకీర్ణం లక్ష్యంగా ఉంది.
ఇది కూడా చదవండి: గ్రీన్కార్డు కోసం ఎదురుచేస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్..ఆ కీలక బిల్లుకు అమెరికా గ్రీన్ సిగ్నల్..!!
ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ చైర్మన్కు మెయిన్ అబ్దుల్మాలిక్ సయీద్ సలహాదారుగా వ్యవహరిస్తారు. బిన్ ముబారక్ను సౌదీ అరేబియాకు సన్నిహితంగా భావిస్తారు. మండలి పునర్వ్యవస్థీకరణ వెనుక కారణాన్ని వివరించలేదు. యెమెన్ 2014 నుండి అంతర్యుద్ధంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇరాన్ మద్దతుగల రెబల్ హౌతీలు యెమెన్లో చాలా ప్రభావం చూపుతున్నారు. అత్యంత పేద అరబ్ దేశంగా పరిగణించబడుతున్న యెమెన్ యుద్ధంతో చాలా వరకు దెబ్బతిన్నది.
ఇది కూడా చదవండి: బ్రిటన్ రాజు చార్లెస్ III క్యాన్సర్..!!
