మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై యాదవ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జేఏసీ సభ్యులు గొల్ల, కురుమలు రేవంత్ రెడ్డిలకు విధించిన గడువు నిన్న అర్ధరాత్రితో ముగిసింది. అయినా… రేవంత్ రెడ్డి స్పందించకపోవడంతో గొల్ల, కురుమలు తమ దారిలోనే కొనసాగారు. ఈరోజు (గురువారం) ఇందిరాపార్క్ నుంచి గాంధీభవన్ ముట్టడి చేసేందుకు ర్యాలీగా బయలుదేరాలని యాదవ జేఏసీ నిర్ణయించింది.
మంత్రి తలసానిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై యాదవ జేఏసీ చాలా రోజులుగా నిరసన వ్యక్తం చేస్తోంది. పలుచోట్ల రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
