
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30% పీఆర్సీ విధించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో దాదాపు 4 వేల మంది వాటర్ అథారిటీ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
ఈ సందర్భంగా ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు ప్రగతి భవన్లో మెట్రో వాటర్ వర్క్స్ యూనియన్ అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్, యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
