రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న కారణంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరింది. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సలహాలు, సూచనలు జారీ చేసింది.
ఎండలో పనిచేయడం, ఆటలాడటం చెప్పులు లేకుండా బయట తిరగడం వంటివి చేయవద్దని చెప్పింది. పార్క్ చేసిన వాహనాల్లోకి పిల్లలు, పెంపుడు జంతువులు వెళ్లకుండా చూడాలని సూచించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో వంటగదికి దూరంగా ఉండటం మంచిదని.. మద్యం, చాయ్, కాఫీ, స్వీట్స్, కూల్డ్రింక్స్ కు దూరంగా ఉండాలని చెప్పింది. శరీర ఉష్ణోగ్రతలు 40.5 సెంటిగ్రేడ్ కంటే ఎకువగా నమోదవడం, విపరీతమైన చెమట, దాహం వేయడం, మగత, బలహీనత, తలతిప్పడం, కండరాలు పట్టేయం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి: ఫోన్ ట్యాపింగ్ కాదు.. వాటర్ ట్యాపింగ్ పైన దృష్టి పెట్టండి