హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యఆరోగ్యశాఖ ఆశా వర్కర్లను పెద్దఎత్తున నియమించనుంది. హైదరాబాద్లో కొత్తగా 1,540 మంది ఆశా వర్కర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆశాల నియామకానికి అనుమతిస్తూ ఆరోగ్యశాఖ మంత్రి ఎస్ఏఎం రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ జిల్లాలో 323, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 974, రంగారెడ్డి జిల్లాలో 243 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ప్రాంతీయ సెర్చ్ కమిటీల ద్వారా ఆశా సిబ్బందిని నియమించనున్నారు. కాగా, ఆశా కార్యకర్త నియామకంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు.
గౌరవనీయులైన సిఎం శ్రీ సారథ్యంలో తెలంగాణ ప్రాథమిక సంరక్షణను బలోపేతం చేసే దిశగా మరో ముందడుగు వేసినందుకు సంతోషిస్తున్నాను #కౌలూన్-కాంటన్ రైల్వే పొడవు. #తెలంగాణ GHMC అంతటా ప్రాంతీయంగా 1,540 ASHA ఉద్యోగాలు (హెల్త్ కేర్ వర్కర్స్) భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆమోదించింది… pic.twitter.com/3MfjWazn7i
— హరీష్ రావు తన్నీరు (@BRSHarish) మార్చి 21, 2023